– వంద సీట్లు గెలుస్తం.. : ఎమ్మెల్సీ కవిత
– ఎంపీ అరవింద్కు ఇవే ఆఖరి ఎన్నికలు : జీవన్రెడ్డి
నవతెలంగాణ-ఆర్మూర్
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తామని, బీఆర్ఎస్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్.. మరి కాంగ్రెస్, బీజేపీలో ఎవరో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ బైపాస్ నుంచి అంకాపూర్ వరకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి శుక్రవారం ప్రజా ఆశీర్వాద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మూడోసారి కూడా ఆర్మూర్ నుంచి జీవన్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కార్యకర్తలను కోరారు. 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించిందని, 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని అన్నారు. ఆర్మూర్ నుంచి ఒక పంతం పట్టిపోదామని, తగ్గేదే లేదని అన్నారు.
జీవన్రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్కు ఇవే ఆఖరి ఎన్నికలని, ఎక్కడ పోటీ చేసినా వేటాడి, వెంటాడి ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు ఎంపీ అరవింద్ బర్త్ డే అని, వచ్చే బర్త్ డే నాటికి మాజీ ఎంపీ కాక తప్పదని అన్నారు. బీఆర్ఎస్ది అభివృద్ధి, విపక్షాలది దుర్బుద్ధి అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెఆర్.సురేష్ రెడ్డి, చైర్మెన్లు మార గంగారెడ్డి, డాక్టర్ మధు శేఖర్, ఆకుల లలిత, జెడ్పీ చైర్మెన్ దాదన్నగారి విఠల్రావు, సీనియర్ నాయకులు రాజారామ్ యాదవ్, కోటపాటి నరసింహ నాయుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.