సీఎం కేసీఆర్ కు మా ఓటు

– పద్మశాలి సంఘం సభ్యులు.

నవతెలంగాణ- తొగుట: సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి దేశానికి ఆదర్శనం గా నిలిచాయని సర్పంచ్ దామ రంచ ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటి గడ్డ కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుందన్నారు. నిర్వాసితు లకు అన్ని విధాలుగా మేలు చేసేందుకు నేను మీ వెంటే ఉంట నన్నారు. పద్మశాలి కులస్తులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తామని వారు తెలిపారని చెప్పారు. కులసంఘం సభ్యులు అందరు కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
Spread the love