న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా భారీగా పెండ్లిండ్లు జరుగుతున్నాయి. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా దాదాపు 42లక్షలకుపైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. ఇందులో దేశ రాజధాని ఢిల్లీలోనే నాలుగు లక్షకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. వివాహ వేడుకల నేపథ్యంలో రూ.5.5లక్షల కోట్లకుపైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. పెండ్లి బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలతో పాటు పెండ్లిండ్ల భోజనాలకు సంబంధించి భారీగా డిమాండ్ సష్టిస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ నిత్యవసర సరుకుల వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత పెండ్లిండ్ల సీజన్లో జూలై 15 వరకు దేశవ్యాప్తంగా దాదాపు 42 లక్షల వివాహాలు జరగనున్నాయి.