టైక్వాండో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పి సుబ్రహ్మణ్యం

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా తైక్వాండోకు సంబంధించిన టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఇటీవల టైక్వాండో అసోసియేషన్ రాష్ట్రస్థాయి ఎన్నికలు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో నిర్వహించిన సంఘం ఎలక్షన్లో మల్కా కొమరయ్య ప్రధాన అధ్యక్షులు గాను ప్రధాన కార్యదర్శి మీర‌్ వహజ్ అలీ ఖాన్ హైదరాబాద్ కు చెందిన పి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీగా ఈయనను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన పి సుబ్రహ్మణ్యం ప్రస్తుతముగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రెటరీగా కొనసాగుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా యువతి యువకులకు విద్యను కొనసాగిస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా స్కూల్లలో కాలేజీలో ఐలమ్మ ట్రస్ట్ తరఫున కూడా యువతి యువకులకు పేద విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అందిస్తున్నారు సేవలకు ప్రతిఫలంగా మంచి అవకాశం లభించిందని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Spread the love