నవతెలంగాణ – జక్రాన్ పల్లి
రైతులకు రుణమాఫీ ప్రకటించినందుకు సీఎం రేవంత్ చిత్ర పటానికి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి తెలిపారు. మండలంలోని అర్గుల్ గ్రామంలోని అర్గుల్ సింగిల్ విండో కార్యవర్గ సమావేశం సంఘ అధ్యక్షులు శ్రీ ఆర్మూర్ గంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంద్భంగా రైతులకు రుణమాఫి ప్రకటించినందుకు గౌరవనీయులైన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ” రేవంత్ రెడ్డి ” రూరల్ ఎమ్మెల్యే” భూపతి రెడ్డి ” చిత్రపటానికి సంఘ అధ్యక్షులు, సంఘ డైరెక్టర్లు పాలాభిషేకం” చేశారు. ఈ కార్యక్రమం లో సంఘ వైస్ చైర్మన్ “అప్పాల నడపి రాజన్న”సంఘ డైరెక్టర్ లు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు.