పరిటాల సునీత దీక్షకు భగ్నం

నవతెలంగాణ- అమరావతి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా  పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు  భగ్నం చేశారు. పరిటాల సునీత గత రెండు రోజులుగా అనంతపురంలోని పాపంపేటలో దీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వైద్యులు సునీతకు పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు మంగళవారం ఆమె దీక్షను భగ్నం చేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Spread the love