తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ-హైదరాబాద్ : కొండగట్టు యాత్రలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లిన జనసేన అధినేత ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.శామీర్ పేటలోని, తుర్కపల్లిలో అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్ గా ఉంటుoదన్నారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని,రానున్న ఐదేళ్లలో ఏపీ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలోను బీజీపీతో కలిపి పనిచేస్తామంటూ పవన్ వ్యాఖ్యలు చేయగా ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 స్థానాల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేనకు ఓటమి ఎదురైంది.కానీ బీజేపీ మాత్రం 8 సీట్లను గెలుచుకుంది.తాజాగా 2024 లో జరిగిన ఎంపీ ఎన్నికలలో తెలంగాణాలో 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతే కాకుండా..వచ్చే ఎన్నికలలో ఆ స్థానాలను 88 లేదా అంతకన్న ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.

Spread the love