మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

నవతెలంగాణ-టేకులపల్లి
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని శనివారం అందజేసినట్టు నాయకులు తెలిపారు. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్‌ నబి మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే, మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. హామీని నిలబెట్టుకోవాలన్నారు. తదితర డిమాండ్ల సాధనకు ఈ నెల 24న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ మండల అధ్యక్షులు నాగలక్ష్మి, జయ, పాపమ్మ, మంగి, అచ్చి, బుల్లి, సోన, విజయ భారతి, సుజాత, భారతి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love