
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో సీఎంఆర్ రైస్ అందించని కోన్ని రైస్ మిల్లులపై ముమ్మర తనిఖీలు నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 16న పెండింగ్ సి.ఎం.ఆర్. రైస్ మిల్లులపై నియమించిన విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ముమ్మర తనిఖీలు చేసి పెద్దమొత్తంలో తేడాలను గమనించి, పూర్తి నివేదిక అందించారని తెలిపారు. తిరుమలగిరి, కోదాడ మిల్లులపై ఎఫ్.ఐ. ఆర్ నమోదు చేశామని , ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మిల్లు యాజమాన్యాలపై ప్రభుత్వ నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని ప్రతి మిల్లు యొక్క నివేదికలను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, ఇంకా కొన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, పెండింగ్ సి.ఎం.ఆర్. అందించకపోతే అట్టి వాటిపై కఠిన చర్యలు తీసుకోనబడతాయని కలెక్టర్ తెలిపారు.