బీఆర్ఎస్ వాగ్దానాలను ప్రజలు నమ్మరు

కేఎస్ఆర్
నవతెలంగాణ పెద్దవంగర: బీఆర్ఎస్ మోసపూరిత ఎన్నికల వాగ్దానాలను ప్రజలు నమ్మరని బీజేపీ జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ర శ్రీనివాస్ రెడ్డి (కేఎస్ఆర్) అన్నారు. సోమవారం మండల పరిధిలోని అవుతాపురం, ఉప్పెరగూడెం, పెద్దవంగర, గంట్లకుంట, పోచంపల్లి గ్రామాల్లో గడపగడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించి, ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయడం పూర్తిగా విఫలం అయ్యాడని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగు రాములు గౌడ్, మండల అధ్యక్షుడు బొమ్మెరబోయిన సుధాకర్ యాదవ్, జిల్లా నాయకులు తలారి సోమయ్య, ఉడుత శ్యామ్, కోట కుమార్, పనికర యాకయ్య, కట్టోజ్ భాస్కర్, జాటోత్ శంకర్, జలగం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love