కులవివక్షకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలి: భూమయ్య

నవతెలంగాణ – బెజ్జంకి 

జిల్లాలోని సీతారాంపల్లి గ్రామంలో హనుమాన్ దీక్ష చేపట్టిన దళిత సామాజిక వర్గాలపై గ్రామంలోని పలువురు అగ్రవర్ణాల వ్యక్తులు కులవివక్ష చూపడం అనాగరికతకు నిదర్శనమని..అసభ్య పదజాలంతో దూషించి కులవివక్షకు పాల్పడిన అగ్రవర్ణ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఏఐఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిచెట్టు భూమయ్య ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను గురువారం డిమాండ్ చేశారు.అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామగా నిలిచిన సిద్దిపేట జిల్లాలో కులవివక్ష అనావాళ్లు మళ్లీ బహిర్గతమవ్వడం చిగ్గుచేటని..ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతమవ్వకుండా పోలీస్ శాఖాధికారులు ఉపేక్షించకుండా అగ్రవర్ణ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో అంబేడ్కర్ యువజన సంఘాల అధ్వర్యంలో మరో ఉద్యమం చేపడుతామని భూమయ్య హెచ్చరించారు.
Spread the love