గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్‌

గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్‌నవతెలంగాణ-శంకర్‌పల్లి
శంకర్‌పల్లి మండలంలోని ఇంద్రారెడ్డి నగర్‌ కాలనీ వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై తరలిస్తున్న నిషేధిత గంజాయిని మోకిలా పోలీ సులు బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. మోకిలా సీఐ వీరబాబు తెలిపిన వివరాలు ప్రకారం మహా రాష్ట్రకు చెందిన ముగ్గురు వ్యక్తులు 44 కిలోల గంజాయి తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర బుల్దానా జిల్లా కంగాన్‌ తాలూకా అంబే టక్లీ గ్రామానికి చెందిన గంజానన్‌ సుభాష్‌ మోహితే, శంభాజీ నగర్‌ జిల్లా అజంతా తానా మంద్రకు చెందిన గోవిందా దారా సింగ్‌ జాదవ్‌, మహా రాష్ట్ర బులదాన జిల్లా ఖంగాన్‌ తాలూకా అంబే తక్లి గ్రామానికి చెందిన శిల్పా గజానంద్‌ మోహితేలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Spread the love