ఫూలే దంపతుల ఆశయాలను కొనసాగించడమే..

– బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రేనవాస్ యాదవ్
– ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణి
నవతెలంగాణ-బెజ్జంకి ఫూలే దంపతుల ఆశయాలను కొనసాగించడమే ద్యేయంగా ప్రభుత్వోన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తోచిన సహయం అందజేయడమని బీఎస్పీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దొల్ల శ్రేనవాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలికల, బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి జనాగం శంకర్, ఎమ్మార్పీఎస్ నాయకుడు లింగాల బాబు, బోధన సిబ్బందితో కలిసి పరీక్షా సామాగ్రి పంపిణి చేశారు. మండలంలోని ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులందరికి పరీక్షా సామాగ్రి పంపిణి చేయనున్నట్టు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Spread the love