దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్స

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలోని సహిత విద్యా వనరుల కేంద్రంలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్స ఫిజియోథెరపీ వైద్యులు వెంకటస్వామి నిర్వహించారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫిజియోథెరపీ చికిత్స పై అవగాహన, పలు సూచనలను వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి, కాంప్లెక్స్ సిఆర్పి మహమ్మద్, ఉపాధ్యాయులు సృజన, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love