– ప్రకటించిన రాష్ట్ర కమిటీ..
నవతెలంగాణ- అశ్వారావుపేట:
విద్యార్ధి దశలోనే వామపక్ష భావజాలంతో విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం విద్యార్ధి సంఘం నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం కార్మిక – శ్రామిక రంగాల పధగామి గా పనిచేస్తున్న సీఐటియు జిల్లా నాయకుడు, దమ్మపేట మండలం ముకుందా పురం వాసి పిట్టల అర్జున్ ను సీపీఐ(ఎం) అశ్వారావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా పార్టీ రాష్ట్ర కమిటీ ఎంపిక చేసింది.
ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పార్టీ పోటీ చేసే నియోజక వర్గాలు, అభ్యర్ధుల జాబితాను శుక్రవారం ప్రకటించారు.
పేరు : పిట్టల అర్జున్,
తండ్రి : నాగులు
గ్రామం : సీతమ్మ
భార్య : ధనలక్ష్మి
సంతానం : ఇద్దరు
కూతురు : స్రవంతి
కుమారుడు : సాత్విక్
జన్మ తేదీ : 20 ఫిబ్రవరి 1975
చదువు : బి.ఎ
రాజకీయ ప్రస్థానం భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్ ) అనుబంధం విద్యార్ధి సంఘం ఎస్.ఎఫ్.ఐ ద్వారా 1994 లో ప్రారంభం అయింది. విద్యార్ధులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం తో పాటు విద్యారంగంలో అనేక సంస్కరణల కోసం పలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
2021 నుండి 2011 వరకు దమ్మపేట మండల కార్యదర్శిగా పని చేసారు. పోడు భూములు సాధనకోసం కేసులు నమోదు అయ్యాయి.
2011 నుండి నేటి వరకు సీఐటియు జిల్లా కమిటీ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులుగా అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నం భోజన కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులు, హమాలీ ల సమస్యలు పై నిరంతరం కార్యక్రమాలు చేపడుతున్నారు.