మహిళా హత్య కేసును చేధించిన పోలీసులు

నవతెలంగాణ – గాంధారి 

గత రెండు రోజుల క్రితం గాంధారిలో గల నల్లాల బాయి లో దొరికిన కుళ్లిపోయిన మృతదేహం గాంధారి మండల కేంద్రానికి చెందిన  బుర్రి కీర్తనగా గుర్తించనైనది. కీర్తన సొంత గ్రామము లింగంపేట మండలం కొర్పోల్. 9 నెలల క్రితం గాంధారి మండల కేంద్రానికి చెందిన బుర్రి విజయ్ తో వివాహం కాగా భార్యాభర్తలు ఇద్దరూ పెళ్లైన కొన్నాళ్లకే బంధువుల అందరికీ దూరంగా గాంధారి లో వేరే దగ్గర కిరాయికి ఉంటున్నారు. వాళ్ల కాపురంలో రోజు గొడవలు జరిగుతూ ఉండేది. అలాగే విజయ్ కుమార్  భార్యపై అనుమానం పడేవాడు. ఎలాగైనా చంపేయాలని గాంధారి మండలానికి చెందిన మరొక వ్యక్తి (బాల నేరస్తులు) ని గత నెల రోజుల క్రితం తన కిరాయికి ఉంటున్న రమ్మని కీర్తనను భర్త గొంతుక పిసకగా , కొన ఊపిరితో ఉన్న ఆమెను ఇద్దరు కలిసి మెడ కు టవల్ తో బిగించి ఉరివేయగా చనిపోయినది.. ఎవరికి అనుమానం రాకుండా గోనెసంచిలో కట్టి గాంధారి చివర్లో గల పాడైన బావిలో పడవేసినారు. మృతురాలికి దగ్గరి బంధువులు ఎవరూ లేకపోవడంతో ఎవరు కూడా ఫిర్యాదు ఇవ్వలేదు.  గత మూడు రోజుల క్రితం రక్తసంబంధీకులు అతన్ని బలవంతం చేయగా పిఎస్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వడంతో, గాంధారి పోలీసులకు భర్త పైనే అనుమానం ఉండడంతో  బావి లో వెతికి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మొన్న శవం లభించగా, ఈరోజు నేరస్తులు వాళ్ళు చేసిన నేరము ఒప్పుకోవడంతో జ్యూడిషియల్ రిమాండ్ కి  పంపడం జారిందని పోలీసులు తెలిపారు.

Spread the love