పదిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు: మంత్రి శ్రీధర్ బాబు

– ఫెయిల్ అయిన వారు నిరాశ చెందొద్దు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంగళవారం ఒక ప్రకటనలో శుభా కాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.ఈ సందర్భంగా దుద్దిళ్ల నవ తెలంగాణ తో మాట్లాడారు ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశకు గురికాకుండా మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలన్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభా కాంక్షలు తెలిపారు.పదవ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు నిరాశకు గురికాకుండా తిరిగి మళ్ళీ ప్రయత్నించి విజయం సాధించాలని, చదువే చదువు సమాజానికి సమాజ అభివృద్ధికి ఉపయోగపడేలా చదవాలని మంత్రి సూచించారు ఉన్నతమైన చదువులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. దేశ భవిష్యత్ ఈనాటి విద్యార్థిని విద్యార్థులపై  ఆధారపడి ఉందన్నారు. తల్లీ తండ్రులు మీపైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.
Spread the love