ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి..

– మండల తహశీల్దార్ రవికుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇటీవల  జిల్లాలోని అన్ని మండలాల్లోని తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్నీ నిర్వహించాలని ఆదేశించినట్లుగా మండల తహశీల్దార్ రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. కావున మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పలు సమస్యలపై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఉ.10.30నిల నుండి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించు ప్రజావాణి కార్యక్రమంలో మండల ప్రజలు తమ సమస్యల పై దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Spread the love