కబడ్డీ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానం

– అందజేసిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మేరావత్ ముని నాయక్

నవతెలంగాణ – పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలంలోని నాయకుని తండాలో సంక్రాంతి పండుగ, మరియు వివేకానంద జయంతి సందర్భంగా ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ గ్రామీణ స్థాయి కబడ్డీ ఛాంపియన్ లీగ్ – 2024 నిర్వహించిన కబడ్డీ పోటీలలో విజేతలు నిలిచిన జట్లకు యువజన కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మేరావత్ మునినాయక్ మంగళవారం బహుమతులు అందజేశారు.ప్రథమ విజేతగా పొందిన రంగుండ్ల జట్టుకు రూ.15,016, షీల్డ్, ద్వితీయ విజేత పొందిన నాయకుని తండా జట్టుకు రూ.12,016, షీల్డ్, తృతీయ విజేత పొందిన నల్లమట్టు తండా జట్లకు 7,016 బహుమతులు అందజేశారు.

         ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మేరావత్ బిచ్యాలు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని అలవార్చుకోవాలని అన్నారు. క్రీడాకారులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చి వారిని ప్రతిభను గుర్తించడంలో ఇది ఒక వేదిక అని కూడా అన్నారు. విజేత పొందిన జట్లకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మేరావత్ పద్మ, మోతి నాయక్,తెలుగు యువత మండల అధ్యక్షులు సపావత్ రంగా చౌహాన్,సేవా నాయక్, తులస్య, ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు బాలచందర్, కార్యదర్శి రమేష్,ఎం ఆర్పి బీఎన్ఎస్ ఫ్రెండ్స్ రంగా, రాయుడు, ప్రభు, హరి, రంగసాయి, శివా, నాగ, రఘు, రాజశేఖర్,రవిందర్,జివిందర్, పాండు, మరియు క్రీడా క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love