Sunday, June 28, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్నేడు పల్స్ పోలియో

నేడు పల్స్ పోలియో

- Advertisement -


రాష్ట్రవ్యాప్తంగా 22,979 బూత్‌లు
సుమారు 40.97 లక్షల మంది
చిన్నారులకు పోలియో చుక్కలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

నేడు(ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయనున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోని వారికి ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేసేలా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 0 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలియో చుక్కలు వేసుకోకుండా ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా బూత్ లు, బృందాలు ఇంటింటి సర్వేల ద్వారా పోలియో డ్రాప్స్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోగా, మిగిలిపోయిన చిన్నారులకు ఈ నెల 29, 30 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేసేందుకు ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలియో చుక్కల కోసం రాష్ట్రవ్యాప్తంగా 22,979 పోలియో బూత్ లు, 903 మొబైల్ బృందాలు, 903 ట్రాన్సిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సుమారు 40.97 లక్షల మంది 0-5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం 52.04 లక్షల డీవీపీ డోసులను జిల్లాలకు సరఫరా చేశారు. పోలియో చుక్కల కార్యక్రమంలో 8,393 ఏఎన్ఎంలు, 27,181 ఆశా కార్యకర్తలు, 34,442 అంగన్‌వాడీ కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. వరద కార్యకలాపాల పిల్లలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాలు, వలస ప్రాంతాల్లోని బస్తీలు, కొత్త కాలనీలు, గిరిజన ప్రాంతాల్లోని చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -