నవతెలంగాణ – ధర్మశాల: ఐపీఎల్-17లో చెన్నై ఆరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139కే పరిమితమైంది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ప్రభ్ సిమ్రన్ (30), శశాంక్ (27), హర్షల్ పటేల్ (12), రాహుల్ (16), హర్ప్రీత్ (17*), రబాడా (11*) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. తుషార్, సిమర్జీత్ సింగ్ చెరో 2, మిచెల్ శాట్నర్, శార్థూల్ తలో వికెట్ తీశారు. తొలుత చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.