మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో గుజరాత్ టైటాన్స్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ అదరగొట్టింది. 19 పరుగులకే 3 వికెట్లు తీసి గుజరాత్ టైటాన్స్ ను ఒత్తిడిలోకి నెట్టింది.  వృద్ధిమాన్ సాహా (1), కెప్టెన్ శుభ్ మాన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6)ల వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు కష్టాల్లో పడింది. సిరాజ్ 2, కామెరాన్ గ్రీన్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం గుజరాత్ స్కోరు 6 ఓవర్లలో 3 వికెట్లకు 23 పరుగులు. షారుఖ్ ఖాన్ 8, డేవిడ్ మిల్లర్ 4 పరుగులతో ఆడుతున్నారు.

Spread the love