CSK vs PBSK: ముగిసిన చెన్నై ఇన్నింగ్స్‌.. టార్గెట్ ఎంతటే?

నవతెలంగాణ – ధర్మశాల: పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. జడేజా (43) మినహా బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. గైక్వాడ్‌ (32), మిచెల్‌ (30), మొయిన్‌ (17), శార్ధూల్‌ (17) ఫర్వాలేదని పించారు. ధోనీ (0), దుబే (0) డకౌట్‌గా వెనుదిరిగారు. బౌలర్లలో హర్షల్‌, రాహుల్‌ చాహర్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా అర్ష్‌దీప్‌ 2, సామ్‌ కరణ్‌ ఒక వికెట్‌ తీశారు.

Spread the love