- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యుమగుచిని ఓడించింది. ప్రతి గేమూ చివరి వరకూ హోరాహోరీగానే సాగింది. అయితే, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ను ముగించింది.
- Advertisement -



