ప్రాధానోపాధ్యాయురాలు పి.పద్మ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తాడిచెర్లలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు పి.పద్మ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రామరావుపల్లి పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి నగర్ లో ఉన్న అంగన్వాడి సెంటర్ను సందర్శించి, విద్యార్థుల జాబితాను సేకరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రీ ప్రైమరీ పిల్లలని నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిఆర్పి సమత, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

