రాహుల్‌ గాంధీ యాత్ర.. లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

నవతెలంగాణ – ఢిల్లీ: ఈ జనవరి 14 నుంచి కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర తరహాలో మారో యాత్ర చేపడతారని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసందే. శనివారం రాహుల్‌ గాంధీ చేపట్టే యాత్రకు ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’గా నామకరణం చేస్తూ కాంగ్రెస్‌ చీఫ్‌ మళ్లికార్జున ఖర్గే ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర లోగో, స్లోగన్‌ను ఖర్గే ఆవిష్కరించారు. ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ మణిపూర్‌లోని ఇంఫాల్‌ నుంచి మహారాష్ట్రలోని ముంబై వరకు బస్సు యాత్రగా కొనసాగనుంది.

Spread the love