నేడు ఈయూ ఎంపీలతో రాహుల్‌ భేటీ

నవతెలంగాణ – హైదరాబాద్
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వారం పాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) పాలన కేంద్రం బ్రస్సెల్స్‌లో ఈయూ ఎంపీలతో సమావేశమవుతారు. తర్వాత పారిస్‌కు వెళ్లి ఈ నెల 9న ఫ్రెంచి పార్లమెంట్‌ సభ్యులతో సమావేశమవుతారు. సైన్స్‌స్‌ పీఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో చర్చాగోష్ఠి నిర్వహిస్తారు. 10న నెదర్లాండ్స్‌, 11న నార్వేకు వెళతారు. 12వ తేదీ రాత్రికి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.
Spread the love