జోరుగా సాగుతున్న జూదం

పోలీసులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యేకు ఫిర్యాదు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పెద్దకొడప్ గల్ మండల కేంద్రం మరియు పరిసర ప్రాంతాల్లో పేకాట రాయుడు జోరుగా జూదమాడుతున్నట్టు స్థానికులు ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు పోలీసులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.బుధవారం రోజు మండల కేంద్రంలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుకు స్థానికులు జూదంపై ఫిర్యాదుచేశారు.ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేంతవరకు చేరిందంటే స్థానిక పోలీసుల నిర్లక్ష్యం ఎంతగా ఉందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వెంటనే స్పందించి స్థానిక పోలీసుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు అరికట్టాల్సిన పోలీసులను నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రజలు తన దాకా విషయాన్ని తీసుకొచ్చారని ఇలాంటి తప్పిదాలు జరుగుతే చర్యలు తప్పవని హెచ్చరించారు.దీనితో ఎస్సై కొనారెడ్డి జూదం నిర్వహిస్తున్న వారికి ఇకపైనుండి జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించినట్టు స్థానికులు తెలుపుతున్నారు.ఎమ్మెల్యేకు ఫిర్యాదు వచ్చేంతవరకు పోలీసులు ఏం చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనుండి అయిన జుదాని అరికట్టాలని మల్లొకసారి ఎమ్మెల్యే దృష్టిదాక వెళ్లకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వాదనలు వినిపిస్తున్నారు.
Spread the love