నవతెలంగాణ – కోల్కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజున పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా. భారీగా కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ భారీ హింస జరిగింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు, బ్యాలెట్ పేపర్లు తగలబెట్టడాలు, దొంగ ఓట్లు, పోలింగ్ బాక్సులు ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు భారీగా జరిగాయి. ఇక పోలింగ్ రోజైన జూలై 8న (శనివారం) జరిగిన హింసలో ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ పార్టీలకు చెందిన 15 మంది మరణించారు. అయితే అనధికారికంగా 18 మంది మృతిచెందారు. దీంతో హింసాత్మక ఘటనలు జరిగిన 19 జిల్లాల్లోని 697 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రీ పోలింగ్ నిర్వహించనుంది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానున్నది.