మణిపూర్‌లో మళ్లీ హింస.. జవాను మృతి

నవతెలంగాణ – ఇంఫాల్‌: మణిపూర్‌లో కుకీ టెర్రిరిస్టులు జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ జవాను ఒకరు మరణించారు. అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సుగ్నులోని సెరు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఉద్రిక్తంగా ఉన్న ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై కుకీ టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దాంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలో కూడా కుకీ మిలిటెంట్లు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. మణిపూర్‌లో ఇంటర్నెట్‌పై నిషేధాన్ని ఈ నెల 10 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Spread the love