తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. జైలు జీవితం నుంచి విముక్తి పొందనున్న వారిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. ఒక్కొక్కరు రూ. 50వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన వారంతా ప్రతి 3 నెలలకొకసారి జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించింది.

Spread the love