కృష్ణవేణి విద్యా సంస్థలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు   

నవతెలంగాణ – గోదావరిఖని 

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత కృష్ణవేణి విద్యా సంస్థలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల, శ్రీనివాస్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థుల చేత ఉపన్యాసాలు,  సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యాసంస్థలలో గణతంత్ర దినోత్సవానికి ముందు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు   పాల్గొన్నారు.
Spread the love