కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి శవయాత్ర

రేవంత్ రెడ్డి శవయాత్ర
రేవంత్ రెడ్డి శవయాత్ర
నవతెలంగాణ-వీణవంక
రాష్ట్రంలో  విద్యుత్ సరపరాపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు సోమవారం పాడే కట్టి శవయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన రహదారి అయిన కరీంనగర్ జమ్మికుంట రోడ్డుపై ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎంపీపీ ముసుపట్ల రేణుక తిరుపతిరెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love