నేడు గ్రామీణ బంద్‌ – సమ్మె

– ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా, ప్రదర్శన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంయుక్త కిసాన్‌ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా శుక్రవారం గ్రామీణ బంద్‌ – సమ్మెను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ప్రదర్శన, ధర్నా చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు , వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, సామాజిక, గిరిజన, మైనార్టీ సంఘాలు భాగస్వాములవుతున్నాయి. కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఐ(ఎం)లతో పాటు వామపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొంటారు.

Spread the love