- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక, మాలవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు చంద్రమొగిలి, రాకెష్, పద్మజరెడ్డి, నరేశ్ లను గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఉన్నతమైన ఆశయాలతో ఒక తరాన్ని…తీర్చిదిద్ది… వారి ద్వారా భవిష్యత్ సమాజాన్ని నిర్మించడమే ఉపాధ్యాయ దినోత్సవమని సర్పంచ్ తెలిపారు.
- Advertisement -



