- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మద్నూర్ గ్రామ సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రి దంపతులు గజమాలతో మంగళవారం ఘన నివాళులు అర్పించారు. గత వారం రోజులుగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విగ్రహం వద్ద అన్ని అంగుళాలతో తీర్చిదిద్దడమే కాకుండా అంబేద్కర్ విగ్రహం ఆవరణలో భారీ ఎత్తున జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రముఖులంతా హాజరయ్యారు. సర్పంచ్ దంపతులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -



