- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి ఒక్కసారిగా భారీగా నీరు, శిథిలాలు దూసుకురావడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు టన్నెల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన సమయంలో ప్రాజెక్టు ప్రాంతంలో 22 మంది పనిచేస్తుండగా, 14 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాల కారణంగా నదుల్లో నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- Advertisement -


