కోనేరు రంగారావు మనువరాలు సత్యప్రియకు అవమానం

నవతెలంగాణ-హైదరాబాద్ : మొన్న మంత్రి విశ్వరూప్‌కు నేడు కోనేరు రంగారావు మనువరాలు డాక్టర్ సత్య ప్రియకు అవమానం జరిగింది. దళిత నాయకుల పట్ల ముఖ్యమంత్రికి.. అయన బంధువర్గానికి చెందిన నాయకులకు చిన్న చూపు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరువూరు నియోజకవర్గం నుంచి సత్యప్రియ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితం వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిని తాడేపల్లిలో అయన నివాసంలో సత్య ప్రియ కలిశారు. తాను కుర్చీలో కూర్చొని ఆమెను జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇంటి మెట్లపై కూర్చోబెట్టారు. దళితులపై చిన్నచూపంటూ సామాజిక మాధ్యమాల్లో తాజాగా ఫొటో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ లో సీనియర్ దళిత నేత, ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు ఉన్నారు.

Spread the love