సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం.. పోలీసులకు షర్మిల ఫిర్యాదు

నవతెలంగాణ – హైదరాబాద్‌: సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిల సైబరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూట్యూబ్‌ చానెల్స్‌, సోషల్‌ మీడియాలో కూడ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను షర్మిల పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షర్మిల తరపున ఆమె భర్త అనిల్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Spread the love