నవతెలంగాణ – హైదారాబాద్: టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ గ్లింప్స్తో పాటు టీజర్ రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. కథను రివీల్ చేయకుండా ట్రైలర్ను కట్ చేశారు మేకర్స్. శర్వానంద్, కృతి శెట్టి కలిసి ఒక బాబుని పెంచుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ బాబు ఎవరు అనేది తెలియకుండా ఉంది. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పాపులర్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.