నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 10 నుంచి భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు, వచ్చే ఏడాది జనవరి 3 నుంచి రెండో టెస్టు జరగనున్నాయి. ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం ఇటీవలే భారత జట్టును ప్రకటించగా… తాజాగా దక్షిణాఫ్రికా కూడా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లో సఫారీ జట్టుకు టెంబా బవుమా కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. యువ బ్యాట్స్ మన్ ట్రిస్టాన్ స్టబ్స్ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్స్ మన్ డేవిడ్ బెడింగ్ హామ్, ఫాస్ట్ బౌలర్ నాండ్రే బర్గర్ కూడా ఈ సిరీస్ ద్వారా టెస్టు క్రికెట్ గడప తొక్కుతున్నారు.
సౌతాఫ్రికా టీ20 జట్టుః ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్మన్, మాథ్యూ బ్రీట్జ్, నండ్రె బర్గర్, గెరాల్డ్ కోయెట్జ్ (తొలి, రెండో టీ20కి మాత్రమే), డొనొవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్ (తొలి, రెండో టీ20కి మాత్రమే), హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి (తొలి, రెండో టీ20కి మాత్రమే), అండిల్ పెహ్లుక్వాయో, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్
వన్డే జట్టుః ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నిల్ బార్ట్మన్, నండ్రె బర్గర్, టోని డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహలి ఎంపగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, ఆండిల్ పెహ్లుక్వాయో, తబ్రైజ్ షంసీ, రస్సీ వాన్డెర్ డసెన్, కైల్ వెర్రెయెన్, లిజాడ్ విలియమ్స్
టెస్టు జట్టుః టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, నండ్రె బర్గర్, గెరాల్డ్ కొయెట్జ్, టోని డి జోర్జి, డీన్ ఎల్గర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్క్రమ్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్, కగిసొ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయెన్