పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

– పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలో సోమవారం జరగనున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కోసం అన్ని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఆదివారం సాయంత్రానికి చేరుకున్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రితో ఎన్నికల సిబ్బంది బందోబస్తు మధ్య మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల సామాగ్రిని గదిలో ఉంచి  వాటికి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఎండలో నిలబడి అలసిపోకుండా ఉండేందుకు నీడ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లను ఏర్పాటు చేశారు.
Spread the love