- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఆ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధించిందని అన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో టౌన్ అధ్యక్షులు కంచిన్వార్ హనుమాన్లు పార్టీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వై గోవింద్, పార్టీ సీనియర్ నాయకులు, మద్నూర్ మాజీ సింగల్ విండో చైర్మన్ విజయ్ కుమార్, రజక సంఘం నాయకులు దేవదాస్, హనుమాన్లు, రాజు, నాగేష్, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



