నవతెలంగాణ కొత్తూరు: తరగతి గదిలో విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తోన్న ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. సమీపంలోని పాన్ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా విద్యార్థులకు విక్రయిస్తున్న చాక్లెట్లు తిని ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆ చాక్లెట్లు తినడంతో తరగతి గదిలో మత్తులోకి జారడంతో పాటు వింతగా ప్రవర్తించారు. గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాక్లెట్లు తినడంతోనే విద్యార్థులు అలా ప్రవర్తించారని గుర్తించారు. పాన్ డబ్బాల యజమానులపై పోలీసులకు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.