మండల కేంద్రంలో జోరుగా బీఆర్‌ఎస్‌ ప్రచారం

నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండల కేంద్రంలో గాంధారి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను చూసి కారు గుర్తుకు ఓటు వేసి సురేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పెద్దపురి సాయికుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, కోఆప్షన్ నెంబర్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
Spread the love