కార్మికుల హక్కుల కోసం బలమైన ఉద్యమాలు

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య
నవతెలంగాణ – చండూరు 
రోజురోజుకు హరించి పోతున్న కార్మికుల హక్కుల కోసం రానున్న రోజుల్లో బలమైన ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య అన్నారు. మే డే సందర్భంగా బుధవారం చండూరు మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద పార్టీ నాయకులతో కలిసి పార్టీ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామలింగయ్య మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను నేటి పాలక ప్రభుత్వాలు వారి హక్కులను హరిస్తూన్నాయని అన్నారు. కార్మికుల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉద్యమాలు  నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి నలపరాజు సతీష్ కుమార్, మండల పార్టీ సహాయ కార్యదర్శులు  పల్లె యాదయ్య, బొడ్డు వెంకటేశ్వర్లు, దోటి వెంకన్న, జెల్లా శ్రీను  గంటా రమేష్, బండమీది వెంకన్న, సిహెచ్ ఉషయ్య, శివర్ల లింగస్వామి, అందరికా పరమేష్, చెరుకు లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love