రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థి ప్రతిభ

నవతెలంగాణ – మల్హర్ రావు

మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు సాత్విక్ కుమార్ రాష్ట్రస్థాయి ఉపన్యాస పోటీల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచాడు. పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణంలోని మేరీ మిథ్యాటీస్ పాఠశాలలో చదువుతున్న సాత్విక్ కుమార్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంపై తల్లిదండ్రులు ఇందారపు లావణ్య రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈనెల 28న సైన్సు దినోత్సవం వరంగల్ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రంలో ప్రశంసా పత్రం అందుకోనున్నారు. విద్యార్థి ప్రతిభకై  గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Spread the love