రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా అథ్లెటిక్స్  అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జిల్లాస్థాయి  అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్  పాఠశాల చెందిన  పి శ్రావణి (16) సంవత్సరాల లోపు వంద మీటర్ల పరువు పందెంలో మొదటి స్థానం సంపాదించిది. (14) సంవత్సరాల లోపు 100 మీటర్ల పరుగు పందెంలో ఎన్ రిషిక మూడవ స్థానం సాధించినట్టు పాఠశాల పీడీ గోపిరెడ్డి బుధవారం తెలిపారు. ఇందులో మొదటి స్థానం సంపాదించిన పి శ్రావణి ఈనెల 28వ తేదీ నుంచి సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ కాంపిటీషన్ కు సెలెక్ట్ కావడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు గెలుపొందిన క్రీడాకారినులను అభినందించారు.
Spread the love