జగన్‌పై రాళ్ల దాడి కేసు..కీలక పరిణామం

Attack on AP CM Jaganనవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం జగన్‌పై రాళ్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ వరకు సతీష్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌పై దాడి కేసులో ఏ-1గా ఉన్న సతీష్‌ను అడ్వొకేట్ సమక్షంలోనే విచారించాలని షరతు విధించింది. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన అంశాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది. కాగా, జగన్ రాళ్ల దాడి కేసులో ప్రధాన నిందితుడి సతీష్‌ను కేసుకు సంబంధించి మరింత విచారించేందుకు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు విని.. పోలీసులు అడిగిన వారం రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ తీర్పు వెలువరించింది. సతీష్‌ను పోలీసులు కస్టడీకి తీసుకోవడంతో ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోనని ఏపీ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Spread the love