- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన ఏటేల్లి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దిద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో గురువారం గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ పరమర్శించి, 50 కిలోల సన్నబియ్యం నిత్యావసర సరుకులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, లకవత్ రాజేందర్, మల్లేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ పాల్గొన్నారు.
- Advertisement -



